APNational

మందుతాగి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు!

ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో మితిమీరి తాగిన ఒక ఆటగాడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడట, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది

Delhi Capitals player : ఈ IPL సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్.గత సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీం టేబుల్ టాపర్ గా కూడా నిల్చింది, అలాంటి టీం ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉండడం ఢిల్లీ అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేసింది.అయితే వరుసగా 5 మ్యాచులు ఓడిపోయినప్పటికీ గత రెండు మ్యాచులు వరుసగా గెలవడం వల్ల మరోసారి ఫామ్ లోకి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం.

KKR ని ఓడించి బోణి కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని చిత్తుచిత్తుగా ఓడించి రెండోసారి గెలిచింది.ఇప్పటి నుండి మిగిలి ఉన్న మ్యాచులన్నీ గెలిస్తే కానీ ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉండదు.అయితే మొన్న SRH తో జరిగిన మ్యాచుతో ఘన విజయం సాధించడం తో ఢిల్లీ క్యాపిటల్స్ టీం హోటల్ లో ఒక రేంజ్ లో పార్టీ చేసుకుందట.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో మితిమీరి తాగిన ఒక ఆటగాడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడట, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇంతకీ అలా అసభ్యంగా ప్రవర్తించిన ఆటగాడు ఇండియన్ టీం కి సంబంధించిన వాడా, లేదా ఫారిన్ ఆటగాడా అనేది ఇంకా బయటకి రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కి సౌరవ్ గంగూలీ డైరెక్టర్ గా ఉన్నాడు, అలాగే ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రిక్కి పాంటింగ్ కౌచ్ గా ఉన్నాడు.ఇలా ఇద్దరు లెజెండ్స్ ఉన్న ఒక టీం లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అని అంటున్నారు నెటిజెన్స్.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం యాజమాన్యం చాలా కఠినమైన ఆంక్షలు విధించిందట.ఇక నుండి కొత్తవాళ్లు రాత్రి పది గంటలు దాటిన తర్వాత హోటల్ లోకి అడుగుపెట్టడానికి లేదంటూ ఆంక్షలు విధించిందట.ఎవరైనా ఈ రూల్స్ ని అతిక్రమిస్తే భారీ మొత్తం మీద జరిమానా విధించి టీం నుండి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసిందట యాజమాన్యం.