SPORTS

రజత పతకాలు సాధించిన స్విమ్మర్ ‘గంధం క్వీని’

అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన గంధం క్వీని విక్టోరియా సత్తా చాటింది. ఆమె రెండు రజత పతకాలు సాధించింది.

ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈనెల 24నుంచి 27వరకు జరిగిన ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల నుంచి హాజరయ్యారు. భారతదేశం తరపున స్వీమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గంధం క్వీని 200 మీటర్ల మహిళల విభాగంలో పాల్గొని 2వ స్థానం నిలిచి మరో రజత పతకం కైవసం చేసుకుంది. 25వ తేదీన ఆదివారం 400 మీటర్ల మహిళల విభాగంలో గంధం క్వీని పాల్గొని రజత పతకం సాధించిన విషయం తెలిసింది. హైదరాబాద్ బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన క్వీని విక్టోరియా అంతర్జాతీయ స్వీమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం పట్ల రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

ఆమనగల్లుకు చెందిన ఐసీడీఎస్‌ రిటైర్డ్‌ సూపర్‌వైజర్‌ గంధం ఎస్తేరు కూతురు గంధం క్వీని. తెలంగాణలోని బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన స్విమ్మర్ గంధం క్వీన్ విక్టోరియా ఆదివారం 400 మీటర్ల (మోనో ఫిన్) ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని తొలి స్విమ్మర్‌గా గంధం క్వీన్ రికార్డుకెక్కింది. పలు టోర్నమెంట్లలో పాల్గొంటూ పతకాలు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తూ ఉన్నాయి.