CINEMATELANGANA

పవిత్ర అంటే ఎందుకంత పిచ్చి నరేషా..

లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు..అంతేకాదు ఇద్దరు కలిసి ‘మళ్లీ పెళ్లి ‘ అనే సినిమాను కూడా తీశారు.. ఆ సినిమా ఇటీవల విడుదలయ్యి మిశ్రమ టాక్ ను అందుకుంది..

ఇక వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కలసి జీవిస్తూ ప్రేమలో మునిగితేలుతున్నారు.. ఇదంతా పక్కన పెడితే పవిత్రా లోకేష్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమె తన మాతృ భాష కన్నడ సాహిత్యంలో పీహెచ్ డీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.. అది తెలుసుకున్న నరేష్ ప్రియురాలి కోరికను తీర్చేందుకు స్వయంగా ఆయనే హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ కోసం తీసుకెళ్లారు…సోషల్ మీడియాలో వీరిద్దరి పై ఎలాంటి రూమర్స్ వస్తున్నా పట్టించుకోకుండా పవిత్ర తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..

ఇది ఇలా ఉండగా.. వారికి పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్నట్లు ఓ ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే ఆల్రెడీ తమకి పిల్లలు ఉండడం వల్ల ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు..పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. పెళ్లిపై తమకు గౌరవం ఉందని.. కానీ ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది అని కామెంట్స్ చేసారు.. అసలు చేసుకుంటారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..