TELANGANA

30 సంవత్సరాల తర్వాత శని శశ రాజయోగం

శనిదేవుడు వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఫలితాలను నిర్థారిస్తాడు. శని రాశుల్లో సంచరించడంవల్ల అన్ని రాశులవారిపై ప్రభావం ఉంటుంది. ఈ నెలలో 17న శని గ్రహం కుంభరాశిలో తిరోగమిస్తుంది.

రాత్రి 10:48 గంటలకు సంచారం ఉంటుంది. ఇది శుభ సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల శని శశ రాజయోగం ఏర్పడుతుందని, అన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయని వెల్లడించారు. ఏయే రాశులవారికి ఈ మిశ్రమ ఫలితాలుంటాయో తెలుసుకుందాం.

సింహ రాశి : 30 సంవత్సరాల తర్వాత శని శశ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రత్యేక యోగం వల్ల సింహరాశి వారు లాభపడనున్నారు. వ్యాపారాలు చేసేవారికి లాభం చేకూరుతుంది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

వృశ్చిక రాశి : ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఇంక్రిమెంటు పొందడంతోపాటు పదోన్నతులు పొందుతారు. వీరు కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనం పొందే మంచి డీల్స్ పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.

కుంభ రాశి : శశ యోగం ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. 30 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో ఈ యోగం ఏర్పడబోతోంది. విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళతారు. పోటీపరీక్షల్లో విజయం సాధించడమే కాకుండా వ్యాపారాలు చేసేవారు లాభాలబాట పడతారు. జీవితం సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం బలోపేతమవుతుంది.