APTELANGANA

న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్

ఆన్‌లైన్‌లో కొందరు దుండగులు యువతుల్ని ట్రాప్ చేసి, వారి వద్ద నుంచి లక్షల్లో దోచుకుంటున్న సంఘటనలు ఈమధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి.

తొలుత పరిచయం పెంచుకోవడం, ఆపై మాయమాటలతో లొంగదీసుకోవడం, న్యూడ్ వీడియో కాల్స్ చేయడం.. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడటం వంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

 

కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్‌పేట ఉలుందాండవర్‌ ఆలయం వీధికి చెందిన సతీష్‌ కుమార్‌ (21) అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం తేని జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. తొలుత అతడే ఈ బాలికకి రిక్వెస్ట్ పెట్టాడు. యువతి యాక్సెప్ట్ చేయడంతో, అతడు చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ‘నువ్వు చాలా బాగుంటావ్’ అంటూ మాయమాటలు చెప్పి, ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి కూడా అతని వలలో పడింది. దీంతో.. అతడు ఊలందూరుపేటకు రావాలని పిలిచాడు. అతడు పిలిచినట్టే.. మే 3వ తేదీన ఆ బాలిక వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి తిరగడమే కాదు.. శారీరకంగానూ కలిశారు. ఈ సందర్భంగా అతడు ఆ బాలిక న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీశాడు.

 

ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక కోసం తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టగా.. ఊలందూరుపేటలో సతీష్ కుమార్ వద్ద ఉందని వాళ్లు తెలుసుకున్నారు. దీంతో వాళ్లు అక్కడికి వెళ్లి.. సతీష్‌కి వార్నింగ్ ఇచ్చి, తమ అమ్మాయిని తీసుకువెళ్లారు. ఇక్కడే సతీష్ తన నీచబుద్ధి బయటపెట్టాడు. బాలిక బంధవులతో మాట్లాడిన అతగాడు.. తనకు రూ.70 వేలు ఇవ్వాలని, లేకపోతే బాలిక న్యూడ్ వీడియోల్ని, ఫోటోలను విడుదల చేస్తానని బెదిరించాడు. అయితే.. వాళ్లు చాకచక్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. సతీష్‌ని అదుపులోకి తీసుకొని, అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.