4news HD TV

TELANGANA

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాల పెంపు,

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు… ఉద్యోగుల జీతాలతో పాటు సంక్షేమం విషయంపై కూడా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్‌ కమ్‌ హెల్పర్లకు…

National

కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Google Meet, WhatsApp, Telegram, ఇతర ఇంటర్నెట్ ఆధారిత వాయిస్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి OTT ప్లేయర్‌లను లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. OTT కమ్యూనికేషన్ సర్వీస్, OTT సర్వీస్ సెలెక్టివ్ బ్యానింగ్‌కు సంబంధించి రెగ్యులేటరీ మెకానిజంపై చర్చా పత్రంలో TRAI ఈ విషయాన్ని పేర్కొంది. టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. టెలికాం…

CINEMA

జపాన్‍లో అదరగొడుతున్న ‘రంగస్థలం’..

మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా టాలీవుడ్‍లో ఓ కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. దీంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రామ్‍చరణ్‍తో పాటు హీరోయిన్ సమంత యాక్టింగ్ కూడా ఈ చిత్రానికి ఓ హైలైట్‍గా నిలిచింది. ఏకంగా రూ.200కోట్లకు పైగా కలెక్షన్‍లను సాధించి బంపర్ హిట్ అయింది రంగస్థలం. మాస్…

World

రష్యా సైన్యంలో అసమ్మతి గళం.. జనరల్ ఇవాన్ పోపోవ్ సస్పెండ్..

ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్‌లో బలగాల కమాండ్‌లో ఉన్న ఒక సీనియర్ రష్యన్ జనరల్ ఇవాన్ పోపోవ్ ను రష్యా తొలగించింది. మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ నాయకత్వం తగినంత మద్దతు ఇవ్వకుండా తన దళాలకు ద్రోహం చేసిందని జనరల్ ఆరోపించడంతో ఈ చర్య తీసుకుంది. జనరల్ ఇవాన్ పోపోవ్ 58వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి కమాండర్‌గా ఉన్నారు. వీరు జపోరిజ్జియా ప్రాంతంలో భారీ యుద్ధం చేస్తున్నారు. ఇవాన్ పోపోవ్ అత్యంత సీనియర్ అధికారులలో ఒకడు. అప్పట్లో ఇవాన్…

AP

మరో కీలక దశ విజయవంతమైందంటూ ఇస్రో ప్రకటన

శ్రీహరికోట/బెంగళూరు: చంద్రయాన్-3 విజయవంతంగా సరైన మార్గంలో దూసుకెళుతోంది. చంద్రయాన్-3 మొదటి కక్ష్యను పెంచే ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శనివారం వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆరోగ్యం సాధారణంగా ఉందని తెలిపింది. అది ఇప్పుడు 41,762 కిమీ x 173 కిమీ కక్ష్యలో ఉందని పేర్కొంది. ‘చంద్రయాన్-3 మిషన్ అప్‌డేట్: వ్యోమనౌక ఆరోగ్యం సాధారణంగా ఉంది. మొదటి కక్ష్య రైజింగ్ యుక్తి…

TELANGANA

రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు

రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై రైతుల్లో బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రుణాలు త్వరలోనే రద్ద చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కరోనా సాకుతో ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయలేదు. దీంతో…

National

భవిష్యత్తులో బయో ఇథనాల్ వాహనాలే.. ఇథనాల్ petrol 60 రూపాయలే..

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఏపీలో తిరుపతి(Tirupati) వద్ద రేణిగుంట నుండి నాయుడుపేట NH71 హైవేపై ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి చొరవతో గ్రీన్ ఇండియా మిషన్ (GIM) భాగస్వామ్యంతో జతకట్టి జాతీయ రహదారులను పర్యావరణపరంగా గ్రీన్ హైవేలుగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెండింతలు చెట్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నాటనున్నారు.…

CINEMA

తొలిసారి పోస్ట్ పెట్టిన పవన్ కల్యాణ్.. జ్ఞాపకాలతో వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్‍స్టాగ్రామ్‍లో అడుగుపెట్టారు. జూలై 4వ తేదీ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ క్రియేట్ అయిన గంటల్లోనే మిలియిన్ ఫాలోవర్లు వచ్చారు. ఒక్క పోస్ట్ పెట్టకుండానే పవన్ ఇన్‍స్టా అకౌంట్‍కు ఇప్పటి వరకు 2.4 మిలియన్ ఫాలోవర్లు అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ ఎప్పడెప్పుడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ పెడతారా అని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు అది నెరవేరింది. నేటి (జూలై 15) సాయంత్రం ఆయన ఇన్‍స్టాగ్రామ్‍లో తొలి పోస్ట్…

World

మోడీకి ఫ్రాన్స్ టూర్ లో షాక్ ? మణిపూర్ హింసను ఖండిస్తూ యూరప్ పార్లమెంట్ తీర్మానం

ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రెండు నెలలుగా సాగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనిపై భారత్ స్పందించింది. అది తమ అంతర్గత విషయమని ఐరోపా దేశాలకు స్పష్టం చేసింది. అయినా భారత ప్రధాని తమ దేశాల్లో పర్యటిస్తున్న వేళ యూరోపియన్ పార్లమెంట్ వేసిన అడుగు కలకలం రేపింది. ప్రధానమంత్రి నరేంద్ర…

AP

. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర, దాని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలతోపాటు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు…