4news HD TV

AP

సర్కార్ గుడ్ న్యూస్..త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు!

: రాజధాని అమరావతి రైతులకు సీఎం జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.   ఈ మేరకు రూ.200 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చామని తెలిపారు. ఈ మొత్తం కూడా రైతుల అకౌంట్లో త్వరలోనే జమ అవుతుందని సీఆర్డీఏ తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు. కాగా అమరావతి రైతులకు కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు ఒకరు హైకోర్టును ఆశ్రయించారు.…

World

మాస్కో విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి..

రష్యా రాజధాని మాస్కో వ్నుకోవో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడి రష్యా ఎయిర్ ఫోర్స్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఉక్రెనియన్ డ్రోన్‌లు దాడి చేశాయని అధికారులు చెప్పారు. డ్రోన్ల దాడితో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్ డిఫెన్స్ నాలుగు డ్రోన్‌లను ధ్వంసం చేసింది. మరొక డ్రోన్ ను ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్‌లను ఉపయోగించి నేలకూల్చినట్లు మాస్కోలోని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెల్లవారుజామున తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని టెలిగ్రామ్…

CINEMA

ముద్దు సీన్లకే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బోల్డ్ షోతో ఓటీటీ టాప్ లేచిపోయేలా…

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.. దాదాపు 18 ఏళ్లకు పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు…

TELANGANA

పుస్తెలమ్మి పోటీ చేసిన బండి సంజయ్ కు వంద కోట్లు ఎలా వచ్చాయ్- రఘునందర్ రావు

తెలంగాణ బీజేపీలో అగ్గిరాజుకుంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం తాను కష్టపడుతుంటే పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన…బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ అధ్యక్షుడు మారిపోతున్నాడంటూ వస్తున్న వార్తలు వాస్తవమేనన్నారు. మునుగోడు ఉపఎన్నికలో వంద కోట్లు ఖర్చు…

National

జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్నితీసుకుంది. వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీఎస్టీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై జీఎస్టీలో అవకతవకలకు గానీ, అక్రమాలకు గానీ పాల్పడితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు చర్యలు తీసుకుంటారు. వారిపై…

AP

ఇకపై సెలవులే సెలవులు.. ఎప్పుడంటే..!

నిత్యం క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు వినీవినీ అలసిపోయే విద్యార్థులకు మధ్యలో ఒక్క రోజు హాలీడే వచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఈ నెలతో పాటు వచ్చే ఆగస్టులోనూ స్టూడెంట్స్‌ రిలేక్స్‌ అయ్యే విధంగా హాలీడేస్‌ ఉన్నాయి.   గత జూన్‌లో స్కూల్స్‌ స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా హాలీడేస్‌ రాలేదు.. సన్‌డేస్‌ కోసం ఎక్కువగా ఎదురుచూడడమే తప్ప.. ఇతర పండుగలు పెద్దగా లేవు. అయితే రానున్న 45రోజుల్లో విద్యార్థులు కాస్త రిలేక్స్‌ అయ్యే విధంగా సెలవులున్నాయి. ఇవాళ సెకండ్‌ సాటర్డే..…

World

కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీ

కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీగా నిరసన తెలిపారు. తాజాగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఒక పోస్టర్ గ్రేటర్ టొరంటో ఏరియా (జిటిఎ)లోని ఒక ఆలయం వెలుపల కనిపించింది. ఈ పోస్టర్ ఖలిస్థాన్ అనుకూలంగా ఉంది. బ్రాంప్టన్‌లోని భారత్ మాతా మందిర్ వెలుపల “వార్ జోన్” పేరుతో ఉన్న పోస్టర్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఉంచబడింది మరియు ఉదయం ఆలయ వాలంటీర్లు కనుగొన్నారు. ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించినట్లు…

CINEMA

57 ఏళ్ల వయస్సులో Salman Khan పెళ్లి..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో. అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతేకాదు ఈ సినిమాకు ప్రేమ్ కు షాదీ అనే టైటిల్ ను ఖరారు చేశారట.…

TELANGANA

అంతర్గత కుమ్ములాటలతో అట్టడుగుకు బీజేపీ, పుంజుకున్న కాంగ్రెస్!

తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సంఘటనలు “లాస్ట్ ది ప్లాట్” అనడానికి సరిగ్గా సరిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల దృష్ట్యా, ఇప్పటివరకు అంతగా లెక్కల్లో లేని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బీజేపీని అధిగమించినట్లు భావిస్తున్నారు. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీదారుగా కాంగ్రెస్ మారిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గంలోని నేతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. నేతల…

National

యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా నోయిడా ప్రాంతంలో నివసిస్తున్న వారికి యోగీ సర్కార్ శుభవార్త చెప్పింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మూడో దశ భూసేకరణ కోసం త్వరలో సామాజిక ప్రభావ సర్వే నిర్వహించేందుకు వీలుగా యోగీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. జెవార్ లో నిర్మించబోతున్న ఈ ఎయిర్ పోర్టు కారణంగా ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోనున్నాయి. యూపీలోని గౌతమబుద్ధనగర్…