3న బీజేపీ జెండా ఎగరాలి: మోడీ అలా.. కేసీఆర్ ఇలా అంటూ అమిత్ షా
ఆదిలాబాద్: డిసెంబర్ 3న హైదరాబాద్లో బీజేపీ జెండా ఎగరాలని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కుమురంభీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు. మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతుందన్నారు అమిత్ షా. కేసీఆర్ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. గిరిజన వర్సిటీకి…

