జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు చోటు..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జట్టులో మరో భారత సంతతి మహిళకు చోటు దక్కింది. భారతీయ-అమెరికన్ నీరా టాండన్ (Indian-American Neera Tanden) తన దేశీయ విధాన మండలి తదుపరి అధిపతిగా అవుట్గోయింగ్ అడ్వైజర్ సుసాన్ రైస్ను భర్తీ చేస్తారని బైడెన్ శుక్రవారం ప్రకటించారు. బైడెన్ నిర్ణయాన్ని అనుసరించి, నీరా టాండన్ వైట్ హౌస్ అడ్వైజరీ కౌన్సిల్కు నాయకత్వం వహించిన మొదటి ఆసియా-అమెరికన్గా నిలిచారు. గతంలో నీరా టాండన్ వైట్హౌస్లో స్టాఫ్ సెక్రటరీగా పనిచేశారు.…

