APNationalTechnologyTELANGANAWorld

యూపీఏ చార్జీల మీద వివరణ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. నియోగదారులకు తక్షణం ఎటువంటి చార్జీలు ఉండవని కేంద్రం వివరణ ఇచ్చింది. UPI చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌పీసీఏ ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు లావాదేవీలు జరిపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఐ తెలిపింది. దేశంలో అత్యధికంగా 99.9 శాతం UPI లావాదేవీలు బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతున్నాయని ఎన్‌పీసీఏ తన ప్రకటనలో తెలిపింది.

 

UPI చెల్లింపు కోసం బ్యాంక్ లేదా కస్టమర్ ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఏ తెలిపింది. అలాగే, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు యూపీఏ లావాదేవీ జరిగినా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI వాలెట్‌లు) ఇప్పుడు ఇంటర్‌ఆపరబుల్ UPI ఎకోసిస్టమ్‌లో భాగమని ఎన్‌పీసీఏ తెలిపింది.

 

దీని దృష్ట్యా, ఇంటర్‌ఆపరబుల్ యూపీఏ పర్యావరణ వ్యవస్థలో భాగంగా PPI వాలెట్‌లను ఎన్‌పీసీఏ అనుమతించింది. ఇంటర్‌చేంజ్ ఛార్జీ PPI వ్యాపార లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది (ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల వ్యాపారి లావాదేవీలు). దీని కోసం కస్టమర్ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.