నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న హిందుస్థానీ అవామ్ మోర్చా
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) సోమవారం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ఉపసంహరణ లేఖను అందజేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో అపాయింట్మెంట్ కోరినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ తెలిపారు.జేడీయూలో తమ పార్టీని విలీనం చేయబోమని సంతోష్ స్పష్టం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన సుమన్, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి హెచ్ఏఎంజాతీయ కార్యవర్గం సమావేశం అవుతుందని చెప్పారు.…