CINEMA

జపాన్‌లోనే అది జరిగింది.. ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఆయన సతీమణి ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసనలు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అప్పట్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పిల్లల్ని కనడానికి మాత్రం ఈ దంపతులు చాలా సమయం తీసుకున్నారు. పెళ్లి అయినా పదేళ్ల తరువాత రామ్ చరణ్, ఉపాసన తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలికేందుకు రెడీ అయ్యారు.

గత ఏడాది డిసెంబర్ లో ఉపాసన ప్రెగ్నెంట్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్వయంగా వెల్లడించారు. గత కొన్నేళ్ల నుంచి ఈ శుభవార్త కోసమే ఎదురుచూస్తున్న మెగా అభిమానులు.. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ తెగ మురిసిపోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.

అయితే తాజాగా ఉపాసన(Upasana) ప్రెగ్నెన్సీ పై రామ్ చరణ్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జమ్ము, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 సదస్సుకు రామ్ చరణ్ హాజరు అయిన సంగతి తెలిసిందే. అయితే సదస్సు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. జపాన్ దేశం పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

త్వరలో తనకు పుట్టబోయే బిడ్డకు జపాన్ దేశంతో సంబంధం ఉందని ఓ సీక్రెట్ చేశాడు. `ఒకప్పుడు యూరప్ నాకు ఇష్టమైన ప్రదేశంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను జపాన్(japan) దేశాన్ని బాగా ఇష్టపడుతున్నాను. నా భార్య ఉపాసన ఇప్పుడు ప్రెగ్నెంట్‌. ఆమెకు ఏడో నెల. ఈ మ్యాజిక్ జపాన్ లోని జరిగింది. అందుకే నాకు జపాన్ చాలా ప్రత్యేకం` అంటూ రామ్ చరణ్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా, గత ఏడాది అక్టోబర్ లో `ఆర్ఆర్ఆర్‌` ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా జపాన్ వెళ్లింది. జపాన్ లో ఈ రొమాంటిక్ కపుల్ బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు ఆ టైమ్‌లో ఉపాసన ప్రెగ్నెంట్ అయిందని రామ్ చరణ్ ఓపెన్ గానే చెప్పేశాడు.