4news HD TV

National

గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌

గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (జూలై 10) కొట్టివేసింది. పిటిషనర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ మాట్లాడుతూ గుర్తింపు కార్డు చూడకుండా నోట్లను మార్చడం ద్వారా అవినీతిపరులు, దేశ వ్యతిరేకులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి.. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం విధానపరమైన అంశమని అన్నారు. ఇందులో మేం జోక్యం చేసుకోమని తెలిపింది. అంతకుముందు మే 29న ఢిల్లీ హైకోర్టు కూడా…

CINEMA

“అందుకే ముందు కమెడియన్ అయ్యా”: బలగం దర్శకుడు వేణు ఎల్దండి

ఈ ఏడాది మార్చి ముందు వరకు కమెడియన్‍గానే అందరి మదిలో ఉన్న వేణు ఎల్దండి.. ‘బలగం’ సినిమా తర్వాత దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు. బలగం చిత్రంతో దర్శకుడిగా అతడు అంత ప్రభావాన్ని చూపాడు. కెరీర్ ఆరంభంలో జబర్దస్త్ షో సహా చాలా చిత్రాల్లో కమెడియన్‍గా చేశాడు వేణు. దీంతో కమెడియన్‍గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఒక్క ‘బలగం’ సినిమాతో ఇప్పుడు అతడిని అందరూ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా చూస్తున్నారు. బలగం చిత్రాన్ని వేణు అంత గొప్పగా…

World

ఎలాన్ మస్క్ మరో సంచలనం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉన్నన్ని రోజులూ రోజుకో సంచలనం రేపుతూ నిత్యం వార్తల్లో నిలిచిన ఈ అపర కుబేరుడు.. తాజాగా ఓ కొత్త స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. కార్పొరేట్ సెగ్మెంట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్‌లో మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చనే అంచనాలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు…

AP

నిరుద్యోగులకు శుభవార్త.. సీబీఓఏలో 1000 మేనేజర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు సిద్ధంగా వున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సీబీఓఐ తెలిపింది. గడువు తేదీ జులై 15లోగా బ్యాంక్ వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి. ఆగస్టులో రెండో వారంలో లేదా మూడో వారంలో ఈ ఉద్యోగాల కోసం…

TELANGANA

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాల పెంపు,

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు… ఉద్యోగుల జీతాలతో పాటు సంక్షేమం విషయంపై కూడా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్‌ కమ్‌ హెల్పర్లకు…

National

కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Google Meet, WhatsApp, Telegram, ఇతర ఇంటర్నెట్ ఆధారిత వాయిస్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి OTT ప్లేయర్‌లను లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. OTT కమ్యూనికేషన్ సర్వీస్, OTT సర్వీస్ సెలెక్టివ్ బ్యానింగ్‌కు సంబంధించి రెగ్యులేటరీ మెకానిజంపై చర్చా పత్రంలో TRAI ఈ విషయాన్ని పేర్కొంది. టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. టెలికాం…

CINEMA

జపాన్‍లో అదరగొడుతున్న ‘రంగస్థలం’..

మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా టాలీవుడ్‍లో ఓ కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. దీంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రామ్‍చరణ్‍తో పాటు హీరోయిన్ సమంత యాక్టింగ్ కూడా ఈ చిత్రానికి ఓ హైలైట్‍గా నిలిచింది. ఏకంగా రూ.200కోట్లకు పైగా కలెక్షన్‍లను సాధించి బంపర్ హిట్ అయింది రంగస్థలం. మాస్…

World

రష్యా సైన్యంలో అసమ్మతి గళం.. జనరల్ ఇవాన్ పోపోవ్ సస్పెండ్..

ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్‌లో బలగాల కమాండ్‌లో ఉన్న ఒక సీనియర్ రష్యన్ జనరల్ ఇవాన్ పోపోవ్ ను రష్యా తొలగించింది. మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ నాయకత్వం తగినంత మద్దతు ఇవ్వకుండా తన దళాలకు ద్రోహం చేసిందని జనరల్ ఆరోపించడంతో ఈ చర్య తీసుకుంది. జనరల్ ఇవాన్ పోపోవ్ 58వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి కమాండర్‌గా ఉన్నారు. వీరు జపోరిజ్జియా ప్రాంతంలో భారీ యుద్ధం చేస్తున్నారు. ఇవాన్ పోపోవ్ అత్యంత సీనియర్ అధికారులలో ఒకడు. అప్పట్లో ఇవాన్…

AP

మరో కీలక దశ విజయవంతమైందంటూ ఇస్రో ప్రకటన

శ్రీహరికోట/బెంగళూరు: చంద్రయాన్-3 విజయవంతంగా సరైన మార్గంలో దూసుకెళుతోంది. చంద్రయాన్-3 మొదటి కక్ష్యను పెంచే ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శనివారం వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆరోగ్యం సాధారణంగా ఉందని తెలిపింది. అది ఇప్పుడు 41,762 కిమీ x 173 కిమీ కక్ష్యలో ఉందని పేర్కొంది. ‘చంద్రయాన్-3 మిషన్ అప్‌డేట్: వ్యోమనౌక ఆరోగ్యం సాధారణంగా ఉంది. మొదటి కక్ష్య రైజింగ్ యుక్తి…

TELANGANA

రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు

రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై రైతుల్లో బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రుణాలు త్వరలోనే రద్ద చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కరోనా సాకుతో ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయలేదు. దీంతో…