4news HD TV

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం-అదనంగా మరో 4368 ఈవీఎంలకు ఆర్డర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరో 9 రోజుల్లో ప్రచారం కూడా పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అదే సమయంలో ఈసీ కూడా ఎన్నికల పోలింగ్ కు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈసీ తప్పనిసరి పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30న జరిగే తెలంగాణ…

TELANGANA

ఆ ఒక్క కారణం చాలదా?: పార్టీ మార్పుపై విమర్శలకు విజయశాంతి కౌంటర్

హైదరాబాద్: పార్టీ మారారంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయశాంతి. ఇటీవల విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె వెల్లడించారు. ‘రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్…

National

టీమిండియాకు నారా లోకేష్ ఓదార్పు-అలా సెలబ్రేట్ చేసుకుందాం..

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియలో ఇవాళ జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్ కు చేరిన రోహిత్ సేన.. ఫైనల్లో మాత్రం కంగారూల ప్రొఫెషనల్ ఆటతీరు ముందు చేతులెత్తేసింది. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన లక్షమంది ప్రేక్షకులతో పాటు వందకోట్లకు పైగా భారతీయులు షాక్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైన టీమిండియాకు…

TELANGANA

అవినీతి, కమీషన్లు: బీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడిన జేపీ నడ్డా

హైదరాబాద్: కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda). ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారి వారసులే పదవుల్లో ఉంటారని.. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశం గురించి, ప్రజల గురించి ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని జేపీ నడ్డా అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ప్రజల సొమ్మును దోచుకున్నారని…

APCINEMA

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.…

Uncategorized

ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే ? రెండే లక్ష్యాలతో వైసీపీ అడుగులు-టార్గెట్ 2024…

వై ఏపీ నీడ్స్ జగన్ : ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి 2019 ఫీట్ ను రిపీట్ చేయడంతో పాటు అంతకంటే మెరుగ్గా 175/175 ఫలితాన్ని సాధించేందుకు అధికార వైసీపీ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలతో పాటు వై ఏపీ నీడ్స్ జగన్ ( జగన్ ఎందుకు కావాలి) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం క్యాడర్ ను ముందుగా సన్నద్ధం చేస్తోంది. సీఎం జగన్ నేరుగా ఈ కార్యక్రమాన్ని…

AP

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. సైట్ మార్చిన ttd

తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్ సైట్ ను మార్చింది. ప్రస్తుతం tirupatibalaji.ap.gov.in అని ఉండగా.. తాజాగా ఆ పేరును ttdevasthanams.ap.gov.in అని మార్చారు. ఈ మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. ‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్’లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తెలియజేశారు. భక్తులు ఇకనుంచి tirupatibalaji.ap.gov.in కాకుండా ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు.…

APNational

తిరుమలలో గరుడసేవ, ఎన్ని లక్షలాది మంది భక్తులు, గోవిందా గోవింద, జన్మధన్యం స్వామి!

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా గురువారం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై (Garuda Vahana) శ్రీవారు విహరించారు. తిరుమలలోని (Tirumala) తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది శ్రీవారి భక్తులు వెయ్యి కళ్లతో వేచి చూశారు. శ్రీవారి భక్తులతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.   తిరుమలలో (Tirumala) గురువారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగో తిరుమాడ వీధుల్లో మోహనీ అవతారంలో శ్రీదేవి, భూదేవి…

TELANGANA

వంద జన్మలెత్తినా సాధించలేరు: రాహుల్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘రాహుల్ జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి.…

TELANGANA

టీఆర్ఎస్‌కు సిలిండర్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజ్య సమితి (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాజ్య సమితిని రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో…