4news HD TV

AP

ఏపీలో త్వరలో డీఎస్సీ ? మంత్రి బొత్స హింట్ ! జగన్ షిఫ్టింగ్, లోకేష్-షా భేటీపై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ వ్రకటించారు. ప్రస్తుతం డీఎస్సికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని తెలిపారు. డీఎస్సీ వివరాలు త్వరలోనే చెప్తామని బొత్స పేర్కొన్నారు. యూనివర్సిటీ ఐఐటీలో ప్రొఫెస్సర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని బొత్స విమర్శించారు.మాట్లాడే అంశాలు…

APTELANGANA

హైదరాబాద్ నుంచి సింగపూర్ విమానాలు పెంపు, బోయింగ్ కూడా

హైదరాబాద్: సింగపూర్ దేశంలోనూ భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచే సింగపూర్ దేశానికి ఎక్కువగా వెళుతుంటారు. అక్కడే స్థిరపడిన వారి సంఖ్యలో దక్షిణాదివాసులే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో సింగపూర్ దేశానికి హైదరాబాద్ నుంచి విమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది సింగపూర్ ఎయిర్‌లైన్స్. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు…

National

డీకే సంచలన వ్యాఖ్యలు, 42 మంది లీడర్స్ ఎవరు ?, ఏం జరుగుతోందని ఆరా తీస్తున్న ఢిల్లీ !

బెంగళూరు: కాంగ్రెస్‌లో (congress) చేరేందుకు ఎదురుచూస్తున్న వివిధ పార్టీలకు (BJP, JDS) చెందిన 42 మందికి పైగా నాయకులు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు చేసుకున్నారని, ఆ దరఖాస్తులు నా ముందు ఉన్నాయని. ఆ పేర్లను ఇప్పుడే వెల్లడించబోమని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar) బాంబు పేల్చారు. త్వరలో ఇతర పార్టీల నాయకులు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని డీకే శికుమార్ అన్నారు. సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు…

National

చంద్రబాబుకు స్కిన్ అలర్జీ- రాజమండ్రి జైల్లో పరీక్షలు..!

స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు అలర్జీ సోకినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు రాజమండ్రి జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి జైలుకు చంద్రబాబు వచ్చి 33 రోజులు పూర్తయింది. ఈ…

APTELANGANA

‘ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం అదే’

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా చంద్రబాబును అరెస్టును ఖండించారు. అయితే, నందమూరి…

National

ఇజ్రాయెల్ (Israel) సైన్యం, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ (Israel) సైన్యం, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా (Gaza) వైపు దూసుకెళుతోంది. ఉగ్రవాదులను మొత్తంగా తుడిచిపెడతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అత్యవసర హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా…

National

కరెంట్ కట్ చేస్తే మీ ఆఫీసులకు తాళం వేస్తామని మాజీ సీఎం వార్నింగ్, సిగ్గుమాలిన ప్రభుత్వంతో !

బెంగళూరు: ప్రభుత్వం రైతులకు ఏడు గంటల పాటు త్రీఫేజ్‌ కరెంటు (electricity) ఇవ్వకుంటే విద్యుత్‌ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన చేపడతామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay) కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం చిక్కబళ్లాపురంలో మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ ఆద్వర్యంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బిగ్ బాస్ లో ఎంట్రీకి ఎమ్మెల్యే ఎంత డబ్బులు తీసుకున్నారంటే ?, సినిమా…

TELANGANA

హరీశ్ సమక్షంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదాభివందనం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం మరోసారి అంధకారంలోకి వెళుతుందన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయే మోటర్లు.. కరెంటు కటకటలు.. కరువులు కర్ఫ్యూలేనని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్వాగత సభ, 16న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ విజయవంతం కోసం నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాధోడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీ లపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి లపై ఈసీ బదిలీ వేటు వేసింది. వీరు మాత్రమే కాకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్, నిజామాబాద్ పోలీస్…

TELANGANA

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం బండి సంజయ్‌ను కలిశారు. ఆరెపల్లితోపాటు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పార్టీలో చేరతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, 2009లో ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మానకొండూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత…