జగన్ పై రెడ్డి సామాజిక వర్గం గుర్రు..
వైసీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీ వెంట నడుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ విభేదించారు. అటు జగన్కు సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఒప్పుకోకపోవడంతో జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆ సమయంలో రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గమంతా ఏకతాటిపైకి వచ్చింది. జగన్కు అండగా నిలబడింది. చాలామంది మంత్రులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు. జగన్…