AP

AP

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టు కీలక నిర్ణయం..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు లాయర్లకూ, ప్రభుత్వ న్యాయవాదులకూ మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉంటున్న చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇవాళ రెగ్యులర్ బెయిల్ పై వాదనలు సాగాయి.   Advertisement ఇవాళ ముందుగా…

AP

రాష్ట్రంలో కీలకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్..

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభమైంది. బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఐదు గ్రామ/వార్డు సచివాలయాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతారు. ఈ నివేదికలను పరిశీలించి నిర్వహణ, విధానపరమైన అంశాలను క్రోడీకరించనున్నారు. బుధ, గురువారాల్లో అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు దీనిపై సూచనలు, సలహాలను ఇవ్వొచ్చు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది.   Advertisement ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, 20న విజయవాడ, విశాఖపట్నం, 24న తిరుపతిలో కుల గణనపై…

AP

టీడీపీ ఆఫీస్ కు సీఐడీ నోటీసులు..

ఏపీ టీడీపీకి సీఐడీ మరో షాకిచ్చింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలని కోరింది. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు సీఐడీ కానిస్టేబుల్‌ నోటీసు అందించారు. ఈనెల 18లోగా కోరిన వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.   పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు చెప్పాలని అని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఈ నెల 18న సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ నోటీసుల్లో…

AP

అమరావతే రాజధాని.. టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టో..

ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేయడానికి సిద్ధమైన టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే రెండుసార్లు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాయి. రాజమండ్రిలో తొలిసారి , విజయవాడలో రెండోసారి భేటీ అయ్యాయి. ఉమ్మడిగా కలిసి పోరాడాల్సిన అంశాలపై ఇరుపార్టీలు నేతలు చర్చించారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ- జనసేన దృష్టిపెట్టాయి.   అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఇరుపార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉమ్మడి…

AP

మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ కలకలం.. తిరుపతిలో అర్ధరాత్రి హల్‌చల్‌..

ఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపుతోంది. తిరుపతిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఈ చెడ్డీ గ్యాంగ్‌ సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు…

APNationalTELANGANA

పొలిటికల్ యాడ్స్ రద్దు.. ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచార అస్త్రం కీలకం. అయితే.. ప్రచారంలో భాగమైన కొన్ని పొలిటికల్‌ యాడ్స్‌ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. తాము అనుమతి ఇచ్చిన ప్రకటనలను మార్చేసి, ప్రసారం చేస్తున్నారంటూ 15 యాడ్స్‌ను ఈసీ రద్దు చేసింది. దీని వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, క్రియేటివ్‌గా యాడ్స్ రూపొందించి ప్రచారం చేయడంతో ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, అవి అలాగే కొనసాగితే ఓడిపోతామని భయపడే బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు…

AP

అలెర్ట్.. ఏపీకి మరోసారి వర్ష సూచన..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు.

APCINEMA

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.…

AP

100 రోజుల ప్రణాళిక.. ఉమ్మడి మేనిఫెస్టో.. అజెండా ఇదేనా..?

తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఏజెండాతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల నేతలు విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పనపై చర్చలు జరిగినట్లు సమాచారం.   పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా సమావేశం జరిగిందని తెలుస్తోంది. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా వెళ్లేందుకు కరపత్రం రెడీ చేసినట్లు సమాచారం.…

AP

తొలిసారి జగన్ పాలన పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్…

వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఆ పార్టీకి మద్దతు ఎలా ఇస్తారు? అంటూ వైసీపీ శ్రేణులు షర్మిలను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ఇవ్వడం ఆమె పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అంటూనే కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. వైయస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇబ్బంది పెట్టిందన్న…